శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జులై 2016 (15:40 IST)

10 -15 నిమిషాలు ఉండివుంటే నన్నూ చంపేసేవారే!... టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్

టర్కీ తిరుగుబాటు చేదు జ్ఞాపకాలను ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఓ సారి నెమరు వేసుకుంటున్నారు. తాను అప్రమత్తంగా లేకుండా ఉండివుంటే నన్నూ చంపేసేవారే అని ఆయన వ్యాఖ్యానించారు.

టర్కీ తిరుగుబాటు చేదు జ్ఞాపకాలను ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఓ సారి నెమరు వేసుకుంటున్నారు. తాను అప్రమత్తంగా లేకుండా ఉండివుంటే నన్నూ చంపేసేవారే అని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో తిరుగుబాటు చేసిన సైనికులకు ఉరిశిక్ష విధించే అంశాన్ని కూడా తోసిపుచ్చలేమని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. 
 
ఇటీవల టర్కీ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేయగా, దీన్ని ఆదేశ ప్రజలు ఉక్కుపాదంతో అణిచివేసిన విషయం తెల్సిందే. అయితే, తిరుగుబాటు చేదు జ్ఞాపకాలు మాత్రం ఆ దేశ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు జరిగిన తిరుగుబాటుతో అతలాకుతలమైన ఆ దేశం ఇప్పుడిప్పుడే ఓ దారిన పడుతోంది. ఈ క్రమంలో మరో తిరుగుబాబు ఎదురైతే ఎలాగన్న భయమే జనాన్ని స్వచ్ఛందంగా రోడ్డపైకి వచ్చేలా చేసింది. 
 
ఈ తిరుగుబాటుపై అధ్యక్షుడు ఎర్డోగాన్ స్పందిస్తూ.. తిరుగుబాబు సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవం భయానకమైనదన్నారు. ‘‘తిరుగుబాటు జరిగిన రాత్రి నేను విశ్రాంతి తీసుకుంటున్న మర్మరీస్ పట్టణాన్ని తిరుగుబాటు దారులు ముట్టడించారు. ఇంకో 10, 15 నిమిషాలు నేను అక్కడే ఉన్నట్లైతే... నన్నూ చంపేసేవారు. లేదా బందీగా పట్టుకుని ఉండేవారు’’ అని ఆయన అని మీడియాకు వివరించారు.