శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 31 మార్చి 2015 (08:49 IST)

ఇంట్లోంచి లాక్కెళ్లి... 12 యేళ్ళ బాలికపై అత్యాచారం.. సజీవ దహనం

పాకిస్తాన్ లో కామాంధులు రెచ్చిపోయారు. నిస్సాహాయులుగా ఉన్న ఓ ఇంటిపై దాడి చేసి, ఆ ఇంటిలోని పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ పై బాలిక సజీవ సాక్ష్యం అవుతుందేమోననే అనుమానంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సజీవ దహనానికి పాల్పడిన  సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
 పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ కు చెందిన ఘోట్కి జిల్లాలోని దాహార్కి పట్టణంలో గతవారాంతంలో ముగ్గురు వ్యక్తులు ఓ ఇంటిపై దాడి చేశారు. ఆ ఇంటిలోని పన్నెండేళ్ళ  బాలికను ఎత్తుకెళ్ళారు. అడ్డుకోబోయిన తల్లిని చితకబాదారు. అనంతరం బాలికపై అత్యాచారం చేశారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. 
 
 స్పృహలోకి వచ్చిన తర్వాత ఆదివారం బాధితురాలి తల్లి తొలిసారిగా మీడియాతో మాట్లాడింది. ఈ ఘోరకృత్యంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో బాలిక సోదరుడు సోమవారం ఘోట్కి సెషన్స్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.