పాకిస్థాన్ వంకర బుద్ధి : కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన!
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ ముష్కర సైన్యం కాల్పులకు తెగబడింది.
బోర్డర్ లోని 22 బీఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా గత రాత్రి నుంచి పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. ఈ ఘటనలో సరిహద్దు గ్రామంలోని ఓ చిన్నారి మృతి చెందింది. దీనికితోడు, ఐదుగురు పౌరులు సహా ఓ భారత జవానుకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.