పాకిస్థాన్లో మరో పరువు హత్య.. ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనీ బ్రిటన్ బ్యూటీ హత్య!
పాకిస్థాన్లో మరో పరువు హత్య జరిగింది. ఇటీవల ఆ దేశ వివాదాస్పద హాట్ మోడల్ ఖండీల్ బలోచ్ను ఆమె సోదరుడే హత్య చేసిన విషయం తెల్సిందే. అసభ్యంగా ఫోటోలు ఇస్తూ.. ట్వీట్లు చేస్తూ కుటుంబ పరువు తీస్తున్నందుకు గాన
పాకిస్థాన్లో మరో పరువు హత్య జరిగింది. ఇటీవల ఆ దేశ వివాదాస్పద హాట్ మోడల్ ఖండీల్ బలోచ్ను ఆమె సోదరుడే హత్య చేసిన విషయం తెల్సిందే. అసభ్యంగా ఫోటోలు ఇస్తూ.. ట్వీట్లు చేస్తూ కుటుంబ పరువు తీస్తున్నందుకు గాను ఖండీల్ సోదరుడు గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన మరచిపోకముందే... తాజాగా మరో పరువు హత్య జరిగింది.
తల్లిదండ్రుల నిర్ణయానికి వ్యతిరేకంగా మరో వ్యక్తిని వివాహం చేసుకున్నంద అక్కసుతో బ్రిటన్కు బ్యూటీ థెరపిస్ట్ హత్యకు గురైంది. ఆమె పేరు సమియా షాహిద్. బ్రాడ్ ఫోర్డ్కు చెందిన బ్యూటీ థెరపిస్ట్ సమియా షాహిద్ పంజాబ్లోని బంధువుల ఇంటికి వెళ్లగా, అక్కడ హత్యకు గురైంది. సమియా మృతదేహానికి పోస్టుమార్టం జరిపించామని ఆమె మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని జీలం జిల్లా పోలీసు అధికారి ముహమ్మద్ అఖిల్ అబ్బాస్ చెప్పారు. తన భార్యకు ఎలాంటి అనారోగ్యం లేదని, అత్తింటి వారే తన భార్యను చంపారని సమియా భర్త కాజమ్ ఆరోపించారు.