శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (18:51 IST)

రెచ్చిపోయిన మతోన్మాదం... ప్రముఖ బ్లాగర్ దారుణ హత్య..!

బంగ్లాదేశ్‌లో మతోన్మాదం మరోసారి రెచ్చిపోయింది. ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్‌ని మతోన్మాదం తలకెక్కిన కొంతమంది ఇస్లాం టైస్టులు ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్‌ని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. అడ్డం వచ్చిన రాయ్ భార్య రఫిదా అహ్మద్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. 
 
రఫీదా ఢాకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఫీదా, అవిజిత్ రాయ్‌లు నాస్తికులు, మతాంతర వివాహం చేసుకున్నారు. రఫిదా ముస్లిం వనిత అవడం వల్ల ఆమెను మాత్రం టైస్టులు ప్రాణాలతో వదిలేసినట్లు ఢాకా పోలీసులు తెలియజేశారు. రఫిదా ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఢాకా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలుపుతున్నారు. 
 
రాయ్ హత్యకు తామే బాధ్యులమంటూ ‘అన్సార్ బంగ్లా-7’అని మతఛాందస సంస్థ ప్రకటిస్తూ భర్త మృతదేహం పక్కన ఒళ్లంత రక్తం కారుతుండగా స్థానికుల సాయం అర్థిస్తున్న దృశ్యాలను సోషల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. మతోన్మాదాన్ని విమర్శిస్తున్నందుకు, అమెరికా పౌరుడైనందుకు తామీ హత్యకు పాల్పడ్డామని చెప్పుకుంది.