శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (21:03 IST)

ఇండో - పాక్‌ల మధ్య న్యూక్లియర్ వార్? పశ్చిమ దేశాల్లో టెన్షన్

దక్షిణాసియాలో అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో చైనా, భారత్, పాకిస్థాన్‌లు ఉన్నాయి. అయితే, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఎపుడైనా అణుయుద్ధం జరగొచ్చని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దీన

దక్షిణాసియాలో అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో చైనా, భారత్, పాకిస్థాన్‌లు ఉన్నాయి. అయితే, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఎపుడైనా అణుయుద్ధం జరగొచ్చని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దీనికికారణం ఈ మూడు దేశాల్లో పదేపదే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమేనని అంటున్నారు. 
 
అయితే, వాషింగ్టన్‌కు చెందిన అట్లాంటిక్ కౌన్సిల్ సంస్థ మాత్రం ఓ క్లారిటీ ఇచ్చింది. భారత్, పాకిస్థాన్ మధ్య అణ్వాయుధ యుద్ధం జరగదని తేల్చేసింది. అట్లాంటిక్ కౌన్సిల్‌లోని దక్షిణాసియా నిపుణులు ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ఇటీవల ఢిల్లీ, ఇస్లామబాద్, బీజింగ్‌లో జరిగిన సెమినార్‌ల ఆధారంగా కౌన్సిల్ ఈ నిర్ణయానికి వచ్చింది. భారత్, పాక్, చైనా మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నా.. ఆ దేశాల మధ్య వర్తకం బాగానే ఉందని, అందువల్ల ఆ దేశాల మధ్య అణు యుద్ధం జరగకపోవచ్చని పేర్కొంది.
 
అలాగే, భారత ఉపఖండంలో అణుయుద్ధం రావొచ్చని వస్తున్న వాదనలకు ఆధారాలు లేవని ఆ సంస్థ వెల్లడించింది. చైనా, భారత్‌లో జాతీయవాదం దూకుడుగా ఉందన్నారు. ఈ మూడు దేశాల్లోనూ అణ్వాయుధ నిర్ణయం మిలిటరీ చేతుల్లో లేదని, ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి, ఆ భయం అవసరం లేదన్నారు.