బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (11:42 IST)

భారత్-పాకిస్థాన్‌ల మధ్య చర్చలు: అమెరికా జోక్యం

భారత్-పాకిస్థాన్‌ల మధ్య చర్చలకు మార్గం సుగమమయ్యేలా అమెరికా తన యత్నాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలోని తమ రాయబార కార్యాలయాల ద్వారా ఇరు దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
 
ఈ నెల 25న భారత్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీ జరగాల్సి ఉంది. అయితే కాశ్మీర్ వేర్పాటువాదులతో భారత్‌లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ చర్చలు నిర్వహించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీని భారత్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.