శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (13:35 IST)

భారత్ - చైనా యుద్ధం తప్పదా? సైనికుల కొట్లాట (Video)

భారత్, చైనా దేశాల మధ్య యుద్ధం వచ్చేలావుంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు మొహరించివున్నారు. అలాగే, ఎపుడైనా యుద్ధానికి సిద్ధమనే సంకేతాలనూ ఇరు దేశాలు పంపించుకుంటున్నాయి. ఇంతలో లడక్‌లో ఇరు దేశ

భారత్, చైనా దేశాల మధ్య యుద్ధం వచ్చేలావుంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు మొహరించివున్నారు. అలాగే, ఎపుడైనా యుద్ధానికి సిద్ధమనే సంకేతాలనూ ఇరు దేశాలు పంపించుకుంటున్నాయి. ఇంతలో లడక్‌లో ఇరు దేశాల సైనికులు తలపడ్డాడరు. ఒక‌రిపై మరొక‌రు పిడిగుద్దులు కురిపించుకున్నారు. రాళ్లు విసురుకున్నారు. 
 
ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (ఆగస్టు 15వ తేదీ) జరుపుకుంటుంటే... మరోవైపు లడక్‌లో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ల‌డ‌క్‌లోని పాంగాంగ్ స‌రస్సు ద‌గ్గ‌ర జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. భార‌త భూభాగంలోకి చైనా సైనికులు రావ‌డానికి ప్ర‌య‌త్నించగా.. భార‌త జ‌వాన్లు అడ్డుకున్నారు. ప‌దుల సంఖ్య‌లో ఇండోటిబెటెన్ బోర్డర్ పోలీసుల‌తోపాటు ఆర్మీ జ‌వాన్లు చైనా సైనికులతో బాహాబాహీకి దిగారు. 

 
 
రెండు గంట‌ల పాటు అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆ త‌ర్వాత రెండు దేశాల సైనికులు డ్రిల్ నిర్వ‌హించి బ్యాన‌ర్లు చూప‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. త‌ర్వాత ఎవ‌రి స్థానాల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత బ్రిగేడియ‌ర్ స్థాయి అధికారులు చ‌ర్చించారు. ఇండియా, చైనా సైనికుల మ‌ధ్య చాలా ఏళ్ల త‌ర్వాత ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగింది. ఓవైపు డోక్లామ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలోనే ల‌డ‌క్‌లో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.