శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 3 జూన్ 2017 (02:57 IST)

మగాళ్లను అక్కడికక్కడే కాల్చేశారు.. ఆడవాళ్లను సెక్స్ బానిసలుగా మార్చేశారు.

ఇది అమ్మాయిల రక్తమాంసాలతో మానవ రూపంలోని ముష్కరులు ఆడుతున్న భయానక గాధ. ఇస్లామిక్ స్టేట్ స్థాపన పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రమూకలను చేర్చుకుంటున్న ఐసిస్ సంస్థ చేసిన ఘాతుకం ప్రపంచ యుద్ధనేరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఐసిస

ఇది అమ్మాయిల రక్తమాంసాలతో మానవ రూపంలోని ముష్కరులు ఆడుతున్న భయానక గాధ. ఇస్లామిక్ స్టేట్ స్థాపన పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రమూకలను చేర్చుకుంటున్న ఐసిస్ సంస్థ చేసిన ఘాతుకం ప్రపంచ యుద్ధనేరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఐసిస్ చెరలో చిక్కి అదృష్టవశాత్తూ ఆ ముష్కరుల బారి నుంచి తప్పించుకున్న ప్రత్యక్ష సాక్షి ఇరాక్ యువతి చెబుతున్న ఆడబానిసల మారణ గాధ హిట్లర్ యూదు జాతిపై సాగించిన మారణ కాండను మళ్లీ జ్ఞాపకాల్లోకి తీసుకొస్తోంది.
 
ఐసిస్ చెర నుంచి తప్పించుకున్న ఇరాక్ యువతి నదియా మురాద్ విషాధ గాథ యావత్ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తోంది. నిజానికి అది కేవలం నదియా గాథ మాత్రమే కాదు. ఐసిస్ ఉగ్రవాదులు మూడేళ్ల క్రితం ఇరాక్‌లోని ఓ ప్రాంతం నుంచి పట్టుకెళ్లిన 3 వేలమంది మహిళల విషాదగాధ. తమ కళ్లెదుటే తమ కుటుంబాల్లోని మగాళ్లను మూకుమ్మడిగా కాల్చి చంపిన ఐసిస్ ఉగ్రవాదులు తమను మాత్రం బానిసలుగా చేసి దేశదేశాల ఉగ్రవాదులకు తాకట్టు పెట్టేశారని నదియా చెబుతోంది. 
 
'మమ్మల్ని అదే క్షణంలో కాల్చి చంపేస్తారనుకున్నాం. మాపై పాశవికంగా అత్యాచారాలు చేస్తారని మాత్రం ఊహించలేదు. ఎంతో సంతోషంగా ఏ కల్మషం లేకుండా నవ్వుతూ ఉండే అమ్మాయిలను ఎత్తుకుపోయి అమ్మేస్తారు. ఆపై కొందరిని సెక్స్ బానిసలుగా చేసి చిత్రవధ చేస్తారు' అంటూ తనను ఎక్కడైతే ఐసిస్ ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారో.. సరిగ్గా మూడేళ్ల తర్వాత తన స్వగ్రామం యాజిదికి చేరుకుని ఉద్వేగానికి లోనైన నదియా మురాద్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో యాజిదీలు, శరణార్థులు, మహిళల హక్కులపై పోరాడే లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు నదియా మురాద్. 
 
మూడేళ్ల కిందట తన జీవితంలో చోటుచేసుకున్న భయానక ఘటనను గురువారం ఐరాసలో చెప్పుకొచ్చారు. '2014 వేసవిలో మా గ్రామం యాజిదిని ఒక్కసారిగా ఐసిస్ ఉగ్రవాదులు చుట్టుముట్టారు. కొన్ని నిమిషాల్లోనే మగవారు.. ఆడవారు అంటూ వేరు చేశారు. పురుషులందర్నీ మా కళ్లముందే నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. దీంతో మమ్మల్ని కూడా చంపేస్తారని భావించాం. కానీ అలా జరగలేదు. మొసుల్ తీసుకెళ్లి యువతులను అమ్మేశారు. ఆ తర్వాత సిరియన్లు, ఇరాకీయులు, ట్యూనిషియన్లు, యూరోపియన్లు మాపై అత్యాచారం చేసేవాళ్లు. యాజిదీకి చెందిన 3వేలకు పైగా ఆడవాళ్లను బలవంతంగా తీసుకెళ్లి సెక్స్ బానిసలుగా చేశారు. అదృష్టవశాత్తూ అదే ఏడాది నవంబర్ లో నేను ఎలాగోలా ఆ నరకకూపం నుంచి తప్పించుకోగలిగాను' అంటూ నదియా మురాద్ తన గతాన్ని వెల్లడించారు. 
 
2015లోనే ఐరాసలో తన మనోవేదనను మురాద్ ఎల్లగక్కారు. ఆపై యూరప్ పార్లమెంటేరియన్‌కు ఇచ్చే సఖరోవ్ అవార్డుతో ఆమెను సత్కరించారు. 19 ఏళ్ల బషర్‌ అనే యువతి ఏకంగా కంటిని కోల్పోయారు. సెక్స్ బానిసగా ఉండేందుకు నిరాకరించినందుకు ఆమెకు ఆ గతి పట్టించారని ఐసిస్ చెర నుంచి తప్పించుకున్న తర్వాత విషయం వెలుగుచూసింది. చాలా కుటుంబాల్లో ఇలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయని మురాద్ వివరించారు.