రోబో...! అది ఆట బొమ్మ కాదు...హంతకురాలు... కార్మికుడి పొట్టపై కాలెట్టి చంపేసింది...!!
రోబో సినిమా తరువాత మనుషుల మనుగడుకు వీటితో ప్రమాదం పొంచి ఉందని చాలామంది హెచ్చరించారు. అవి ఆట బొమ్మలు కాదని ఇష్టానుసారం అడుకోవద్దని చెబుతూనే ఉన్నారు. వారు చెప్పినట్లే ఓ రోబో కార్మికుడిని తొక్కి చంపేసింది. కార్మికుడిని దగ్గరికి లాక్కుని, ఓ లోహపు పలకపై వేసి ఛాతీపై నొక్కుతూ నలిపేసింది! ఈ సంఘటన జర్మనీలోని ఫోక్స్వ్యాగన్ కంపెనీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
ఫ్రాంక్పర్ట్కు 100 కి.మీ. దూరంలోని బౌనతల్ వద్ద గల ఫోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీలో మంగళవారం రోబోను జేసీబీలా ఉండే రోబోటిక్ యంత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా యంత్రాలను జోడించే చోటు(అసెంబెల్డ్ లైన్) వద్ద ఈ రోబోలు మనుషులకు పక్కపక్కనే ఉంటూ పనిచేస్తాయి. తర్వాత సేఫ్టీ బోన్లలోకి వెళతాయి. ప్రమాదానికి కారణమైన రోబోను ఇన్స్టాల్ చేసేందుకని ఓ కార్మికుడు సేఫ్టీ బోను లోపలికి వెళ్లడంతో అతడిని చంపేసినట్లు తెలిపింది.
దీనిపై ఫోక్స్ వ్యాగన్ వర్గాలు స్పందిస్తూ.. ఇందులో రోబో వైఫల్యం లేదని, మానవ తప్పిదం వల్లే ఇలా జరిగిందని తెలిపాయి. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.