శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (11:21 IST)

పట్టాలు లేకుండా నడిచే స్మార్ట్ ట్రైన్... (వీడియో)

ప్రపంచ తొలి స్మార్ట్ ట్రైన్‌ను చైనా ఆవిష్కరించింది. ఈ ట్రైన్‌ ట్రయల్ రన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించింది. ఈ ట్రైన్ ప్రత్యేకతలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ యేడాది జూన్‌లో ఈ స్మార్ట్ ట్ర

ప్రపంచ తొలి స్మార్ట్ ట్రైన్‌ను చైనా ఆవిష్కరించింది. ఈ ట్రైన్‌ ట్రయల్ రన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించింది. ఈ ట్రైన్ ప్రత్యేకతలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ యేడాది జూన్‌లో ఈ స్మార్ట్ ట్రైన్‌ను ఆవిష్కరించగా.. ప్రస్తుతం హునాన్‌ రాష్ట్రంలోని జుజోయ్‌ నగరంలో ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు.
 
సాధారణంగా ట్రైన్ అనగానే దానికో పట్టాలు.. ప్రత్యేక వ్యవస్థలు ఉండాలి. ఉంటాయి కూడా. కానీ, ఈ స్మార్ట్ ట్రైన్‌కు అలాంటివేం అక్కర్లేదు. బ్యాటరీ, రోడ్డుపై చిన్నపాటి గీతలుంటే సరిపోతుంది. ఈ ట్రైన్ ఎంచెక్కా దూసుకెళుతుంది. 
 
ఈ తరహా రైల్వే వ్యవస్థను అటానమస్‌ రైల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ (ఏఆర్‌టీ)గా వ్యవహరిస్తారు. మూడు బోగీలు ఉండే ఈ రైల్లో ఒకేసారి 300 మంది ప్రయాణించొచ్చు. గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 25 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. రోడ్లపై గీసిన తెల్లటి చారలపై ఈ రైలు నడుస్తుంది. 
 
అంతేకాదు అర్బన్‌ ట్రైన్‌ లేదా ట్రామ్‌లు నడవాలంటే ట్రాక్‌లు తప్పనిసరి. దీనికి వాటితో పనిలేదు. అందుకే దీని ఏర్పాటుకు ఖర్చు కూడా తక్కువే అవుతోంది. ప్రస్తుతానికి నాలుగు స్టేషన్లను కలుపుతూ 3.1 కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ రైలు ప్రయాణిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే యేది ఆఖరు నాటికి ఈ రైలు చైనాలో పరుగులు పెట్టనుంది.