శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

ధోనీకి మించిన మొనగాడు లేడు.. యు టర్న్ తీసుకున్న పూణె జట్టు ఓనర్

రైజింగ్ పూణె సూపర్‌జైంట్ జట్టు యజమాని యూ టర్న్ తీసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ జూలు విదిల్చి బ్యాటింగ్ చేయడమే కాకుండా ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని చేకూర్చిపెట్టినందుకు జట్టు యజమాని అభినందల్లో ముంచెత్

రైజింగ్ పూణె సూపర్‌జైంట్ జట్టు యజమాని యూ టర్న్ తీసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ జూలు విదిల్చి బ్యాటింగ్ చేయడమే కాకుండా ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని చేకూర్చిపెట్టినందుకు జట్టు యజమాని అభినందల్లో ముంచెత్తుతున్నాడు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై పూణె జట్టు విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. 
 
అంతకుముందు ధోనీ వరుసగా విఫలం కావడంతో 'అడవికి రారాజు స్మిత్' అంటూ ధోనీని కించపరుస్తూ పూణె టీమ్ ఓనర్ సంజీవ్ గోయంకా సోదరుడు హర్షా గోయంకా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు కూడా చెలరేగాయి. క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో, శనివారం హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ విశ్వరూపం ప్రదర్శించాడు. మ్యాచ్ను గెలవాలంటే మూడు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన తరుణంలో... తనదైన శైలిలో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు ధోనీ. కేవలం 34 బంతుల్లో 61 పరుగులు చేసి తన జట్టుకు ఘన విజయాన్ని అందించాడు.
 
దీంతో, పూణె టీమ్ ఓనర్ బ్రదర్ యూటర్న్ తీసుకున్నాడు. ఏ నోటితో అయితే ధోనీపై విమర్శలు చేశాడో... అదే నోటితో ఇప్పుడు జార్ఖండ్ డైనమైట్ను పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. ధోనీ ఫామ్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉందని... మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో ధోనీకి మించిన మొనగాడు లేడంటూ ట్వీట్ చేశాడు.