వీవో ఐపీఎల్ పదో సీజన్: టైటిల్ విజేతగా నిలిచిన జట్టుకు రూ.15కోట్ల ప్రైజ్ మనీ
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో టైటిల్ విజేతగా నిలిచిన జట్టు రూ. 15 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుంది. అలాగే రన్నరప్గా నిలిచే జట్టు కూడా రూ.10 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది. వీ
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో టైటిల్ విజేతగా నిలిచిన జట్టు రూ. 15 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుంది. అలాగే రన్నరప్గా నిలిచే జట్టు కూడా రూ.10 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది. వీటితో పాటు ఇతర అవార్డులకు కూడా కొరత లేదు.
మే 21వ తేదీన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఫైనల్స్ జరగనున్నాయి. ఈ ఫైనల్స్లో గెలిచిన జట్టు భారీగా ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటుంది. ఐపీఎల్ 2017 విన్నర్కి ట్రోఫీతో పాటు రూ.15 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. దీంతో పాటు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా మెమొంటోలను అందుకుంటారు.
లీగ్ గేమ్స్ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు రూ. లక్షతో పాటు ట్రోఫీ అందజేస్తారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ (ప్లే ఆఫ్స్)కు రూ.5 లక్షలతో పాటు ట్రోఫీ అందజేస్తారు. ఇంకా వీవో మ్యాచ్లో అద్భుతమైన క్యాచ్ అవార్డు కింద లక్ష రూపాయలు, వీవో సీజన్లో అద్భుతమైన క్యాచ్ కోసం రూ. 10 లక్షలు ట్రోఫీ అంద చేస్తారు. మొత్తం ఐపీఎల్ పదో సీజన్లు 15కి మించిన అవార్డులను ఇవ్వనున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.