శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : శనివారం, 19 మే 2018 (10:34 IST)

ఐపీఎల్ : చెన్నైకి షాక్ .. 34 రన్స్‌తో.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, చెన్నైసూపర్ కింగ్స్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ షాక్ ఇచ్చింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్ నుంచి ఔటైన ఢిల్లీ.. టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన చెన్నైని చిత్తుగా ఓడించింది. శుక్రవారం రాత్రి

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, చెన్నైసూపర్ కింగ్స్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ షాక్ ఇచ్చింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్ నుంచి ఔటైన ఢిల్లీ.. టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన చెన్నైని చిత్తుగా ఓడించింది. శుక్రవారం రాత్రి సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కుర్రోళ్లు రెచ్చిపోయారు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన శ్రేయాస్ గ్యాంగ్.. చెన్నై సూపర్ కింగ్స్‌పై సూపర్ విక్టరీని సాధించారు.
 
తొలుత టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. రిషబ్ పంత్  26 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగుల చేయగా, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచాఖర్లో హర్షల్ పటేల్ 16 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 36 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఎంగిడి 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, చాహర్ తలో వికెట్ తీశారు.
 
ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. 29 బాల్స్ ఆడిన అంబటి రాయుడు నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ధోని 23 బంతుల్లో 17 రన్స్ చేయగా.. రవీంద్ర జడేజా 27 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్, అమిత్ మిశ్రా తలో 2 వికెట్లు తీశారు. సందీప్ లామిచానె, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.