ఐపీఎల్ 9: శతక్కొట్టిన క్వింటన్.. బెంగళూరుపై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపు
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ తొమ్మిదో సీజన్లో భాగంగా బెంగళూరుపై ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపును నమోదు చేసుకుంది. గేల్ రాణించలేకపోయినా.. కెప్టెన్ కోహ్లీ, ఏబీ డివిల్లీర్స్ వీర బాదుడుతో ఢిల్లీ విజయం సాధించింది. సౌతాఫ్రికా కుర్ర బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ (51 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 108) కసి ముందు కొండంత స్కోరు ఇట్టే కరిగిపోయింది.
కోహ్లీ నైపుణ్యాన్ని తలదన్నేలా, డివిల్లీర్స్ దూకుడును మించేలా.. వాట్సన్ విధ్వంసాన్ని మర్చిపోయేలా సాగిన అతని కళాత్మక బ్యాటింగ్తో చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. డికాక్ శతక విలయానికి తోడు కరుణ్ నాయర్ (42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 54 నాటౌట్) కమాల్ తోడవడంతో ఢిల్లీ ఖాతాలో అద్భుత విజయం చేరింది.
ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఏడు వికెట్లతో కోహ్లీసేనను చిత్తు చేసింది. బెంగళూరు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో డికాక్, కరుణ్ చెలరేగడంతో మరో ఐదు బంతులు మిగులుండగానే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.