ఐపీఎల్లో హ్యాట్రిక్: రాజస్థాన్ ముచ్చటగా మూడోసారి విన్.. ముంబై డౌన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్8వ సీజన్లో రాజస్థాన్-ముంబైలు హ్యాట్రిక్ సాధించాయి. వీటిలో రాజస్థాన్ రాయల్స్ ముచ్చటగా మూడో విజయం సాధిస్తే.. ముంబై ఇండియన్స్ వరుసగా మూజోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబయి ఇండియన్స్ చివరి వరకూ విజయం కోసం పోరాడినా చివరికి విజయం రాజస్థాన్నే వరించింది. స్మిత్, రహానె పట్టుదల ముందు పొలార్డ్, అండర్సన్ విధ్వంసక ఇన్నింగ్స్ వృధా అయ్యాయి.
అహ్మదాబాద్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' స్టీవెన్ స్మిత్ (79 నాటౌట్), రహానె (46) మెరుపులతో మంగళవారం రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ను ఓడించింది. మొదట పొలార్డ్ (70), అండర్సన్ (50) విధ్వంసం సృష్టించడంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.