శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (15:40 IST)

మార్కెట్లోకి 1,400 నుంచి 1,500 కొత్త మోడల్ ఫోన్లు!

భారతీయ మార్కెట్లోకి ఈ ఏడాది భారీ కొత్త మోడల్ ఫోన్లు రానున్నాయి. జియామి, ఆసుస్, మోటొరోలా, ఒబి తదితర మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్‌లో తమ మార్కెట్ షేర్ పెంచుకోవాలనుకుంటున్నాయి. ఈ ఏడాది మార్కెట్‌లో దాదాపు 1,400 నుంచి 1,500 కొత్త మోడల్స్ రాబోతున్నాయట.
 
"2015లో మేము 1,400 నుంచి 1,500ల ఫోన్లను విడుదల చేయాలని అనుకుంటున్నామని గతేడాది కన్నా ఈ ఏడాది 20 శాతం మోడల్స్ పెరగనున్నాయి" అని 91 మొబైల్స్‌డాట్ కామ్ తెలిపింది. గతేడాది మొత్తం 1,137 ఫోన్లను లాంఛ్ చేశారు.