శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (08:52 IST)

ఎయిర్‌టెల్ మ‌రో బంప‌ర్‌ ఆఫర్... రోజుకు 3జీబీ డేటా

దేశీయ టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కం

దేశీయ టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడా అదే స్థాయిలో ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మ‌రో ఆఫర్‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. ఇప్పటికే జియోకి పోటీగా ప‌లు ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టిన ఎయిర్‌టెల్.. త‌మ ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం రూ.799తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా, ఫ్రీ అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తున్న‌ట్లు పేర్కొంది. 
 
జియో కూడా ఇటీవ‌ల ఇటువంటి ఆఫ‌రే తీసుకురావ‌డంతో పోటీని త‌ట్టుకోవడానికి ఎయిర్‌టెల్ కూడా ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఉచిత మంత్రాన్ని జపిస్తూ టెలికాం మార్కెట్లోకి వ‌చ్చిన‌ రిల‌య‌న్స్ జియో అదే జోరును కొన‌సాగిస్తుండ‌టంతో టెలికాం కంపెనీల మ‌ధ్య విప‌రీతంగా పోటీ నెల‌కొంది.