త్వరలో రూ.10 వేలకే లెనోవా క్రోమ్ బుక్స్!
ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవా అతి తక్కువ ధరకే క్రోమ్ బుక్స్ను వచ్చే యేడాది అందుబాటులోకి తీసుకునిరానుంది. ఇప్పటికే హెచ్పీ, తోషిబా సంస్థలు ఈ ఏడాది అతి తక్కువ ధరకు క్రోమ్ బుక్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో.. ఆసుస్, లెనోవా కంపెనీలు కూడా తక్కువ ధర క్రోమ్ బుక్లను రూపొందిస్తున్నాయి. 11.6 అంగుళాల డిస్ ప్లే ఉండే క్రోమ్ బుక్స్ను 2015లో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం. కేవలం సుమారుగా రూ.9,200 ఆ లాప్ టాప్ ధరను నిర్ణయించినట్టు తెలుస్తోంది.