బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (16:42 IST)

డెల్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్స్!

ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ మరో రెండు ఆండ్రాయిడ్‌ టాబ్లెట్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. డెల్ వెన్యు 7, డెల్ వెన్యు 8 పేరుతో తాజా మోడళ్లు భారత మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన టాబ్లెట్స్‌లో 3జీతో పాటు వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. దీంట్లో, 4,550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, లేటెస్ట్ డ్యూయల్-కోర్ ఇంటెల్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ ఓఎస్ ఉన్నాయి. 
 
ఇక, డెల్ వెన్యు 7లో 7 అంగుళాల డిస్ ప్లే, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా దీని ప్రత్యేకతలు. డెల్ వెన్యు 8లో పూర్తి హెచ్ డీ డిస్‌ప్లే, 1 జీబీ రామ్, 5 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తున్నారు. వాటి ధరల విషయానికొస్తే, వెన్యు 7 రూ.14,999తో, వెన్యు 8 రూ.18,999తో మార్కెట్లో లభ్యమవుతాయి.