శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (12:32 IST)

కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ : ఖరీదు రూ.5,999

కొత్త ఆసక్తికరమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ కానుంది. ఈ ఫోనును యాండీ ఎలాంటీ-5 పేరిట ఐబాల్ తయారు చేసింది. మరో రెండు వారాల్లో భారత మార్కెట్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర రూ.5,999 అని సంస్థ వివరించింది. 
 
ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న 180 డిగ్రీల రొటేటింగ్ కెమెరా, ఫ్లాష్, 8జిబి ఇన్ బిల్ట్ మెమొరీ, 5 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 జిహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 
 
3జి, వైఫై, జీపీఎస్, మైక్రో-యూఎస్ బీ తదితర సదుపాయాలు కూడా ఉన్నాయని సంస్థ డైరెక్టర్ సందీప్ పరశురాంపూరియా తెలిపారు. ఇది రూ. 6 వేల కన్నా తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కాగలదని చెప్పారు.