గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2017 (15:20 IST)

అప్రైజల్‌పై 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తి అసంతృప్తి... ఉద్యోగులకున్న నమ్మకం ఏమవుతుంది?

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో అమలు చేస్తున్న అప్రైజల్ విధానంపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్.నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న అప్రైజల్ విధానం వల్ల ఇన్ఫోసిస్ బోర్

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో అమలు చేస్తున్న అప్రైజల్ విధానంపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్.నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న అప్రైజల్ విధానం వల్ల ఇన్ఫోసిస్ బోర్డుపై ఉద్యోగులకున్న నమ్మకం పోతుందని ఆయన వాపోయారు. కొత్త ఆర్థిక సంవత్సరానికిగాను ఇన్ఫోసిస్‌లో వేతనాల పెంపు కార్యక్రమం అప్రైజల్ పూర్తిచేశారు. ఇందులో ఉన్నతోద్యోగులకు 60 నుంచి 70 శాతం మేరకు వేతనాలను, మిగతావారిలో అత్యధికులకు 6 నుంచి 8 శాతం మాత్రమే జీతాలు పెంచారు. 
 
దీనిపై ఆ సంస్థ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి స్పందిస్తూ అప్రైజల్ కోసం పాటించిన విధానం అనైతికమని చురకలంటిస్తూ బోర్డుకు లేఖ రాశారు. ఇలాంటి చర్యల వల్ల బోర్డుపై ఉద్యోగులకు ఉన్న నమ్మకం పోతుందన్నారు. కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాకు ఇస్తున్న ప్యాకేజీ పెంచిన విషయంలో కూడా బోర్డు డైరెక్టర్ల నిర్ణయంపై తనకు అసంతృప్తిగానే ఉందని నారాయణమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.
 
కాగా, సంస్థలో పని చేసే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు సాలీనా రూ.4.62 కోట్ల వేతనం, ఆపై రూ.3.88 కోట్ల పరిహారం ఇవ్వాలని డైరెక్టర్లు నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేవలం 24 శాతం మంది ప్రమోటర్లు మాత్రమే ప్రవీణ్ రావు వేతన పెంపుపై అనుకూలంగా ఉన్నారని ఆయన తన లేఖలో గుర్తు చేశారు.