శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జులై 2018 (14:46 IST)

సంచలనాలకు తెరతీసిన జియో... ఫీచర్లు ఏంటి?

దేశీయ టెలికాం రంగంలో జియో సంచలనాలు కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సమావేశంలో ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ జియో-2 ఫోన్‍ను విడుదల చేశారు. ఈ ఫోన్ ధర రూ.3 వేలు మాత్రమే. ఈ ధరకే అన్ని రకాల

దేశీయ టెలికాం రంగంలో జియో సంచలనాలు కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సమావేశంలో ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ జియో-2 ఫోన్‍ను విడుదల చేశారు. ఈ ఫోన్ ధర రూ.3 వేలు మాత్రమే. ఈ ధరకే అన్ని రకాల ఫీచర్ ఫోన్‌తో ప్రవేశపెట్టనున్నారు.
 
ఇందులో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ ఫీచర్స్‌తో కొత్త ఫోన్ విడుదల అవుతుంది. కొత్త జియో ఫోన్‌లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా.. పాత జియోలో కూడా అందుబాటులోకి వస్తాయని ఆయన ప్రకటించారు. 
 
జియో-2 ఫీచర్స్ ఏంటీ :
ఆపరేటింగ్ కియోస్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ర్యామ్, 128 జీబీకి స్టోరేజ్ పెంచుకోవచ్చు, 2.4 క్యూవీజీఏ ప్లే, 2 మెగా ఫిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేస్ కెమెరా, డ్యూయల్ సిమ్, ఒకటి 4జీలో పనిచేస్తోంది. మరొకటి వోల్టేలో వర్క్ చేస్తోంది. వై-ఫై కనెక్టివిటీ ఉంది, ఎఫ్ఎం, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ ఫీచర్స్ ఉన్నాయి.