శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 మే 2016 (19:52 IST)

4జీబీ ర్యామ్‌తో లీఎకో స్మార్ట్ ఫోన్లు.. జూన్ 8న భారత్‌లో ఆవిష్కరణ.. ఫీచర్లివే...

చైనాకు చెందిన లీఎకో మొబైల్ కంపెనీ భారత్‌లో మరో మూడు రకాల స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనుంది. గత ఏప్రిల్ నెలలో చైనాలో ఆవిష్కరించిన మోడల్స్‌నే భారత్‌లోనూ జూన్ ఎనిమిదో తేదీన జరిగే ఓ కార్యక్రమంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇవి లీ 2, లీ 2 ప్రో, లీ మ్యాక్స్ 2 పేరుతో ఉన్నాయి. గత జనవరిలో భారత మొబైల్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఈ కంపెనీ... ప్రారంభంలో లీ 1ఎస్, లీ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించి, మే నెలలో 10,899 రూపాయల ధరను నిర్ణయించి విక్రయించింది. ఇపుడు కూడా ఈ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్న ఈ ఫోన్.. వీటి ధరలను మాత్రం వెల్లడించలేదు. 
 
ఈ ఫోనులోని ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే (లీఎకో లీ మ్యాక్స్ 2)... 
ఈ ఫోన్ 5.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 X 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ కలిగివుంటుంది. అలాగే, 2.15 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 820 ప్రాసెస‌ర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్, 4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్,  21 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో పాటు.. డాల్బీ అట్మోస్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్‌-సి, 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0తో పాటు.. మరికొన్ని అత్యాధునిక ఫీచర్లను కలిగివుంది.