శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 21 జులై 2014 (14:44 IST)

స్మార్ట్ ఫోన్ జీ3ని మార్కెట్‌లోకి విడుదల చేసిన ఎల్.జి.

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్.జీ తన నూతన స్మార్ట్ ఫోన్ 'జీ3'ని భారత మార్కెట్లోకి సోమవారం ముంబైలో విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు రంగుల్లో వినియోగదారులకు లభించనుంది. 32 జీబీ మెమొరీ సామర్థ్యం గల మొబైల్ ధర రూ.50,990 కాగా, 16 జీబీ సామర్థ్యం గల ఫోన్ ధరను రూ.47,990గా నిర్ణయించారు. 
 
ఈ సందర్భంగా ఎల్.జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సూన్క్ నో మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ల విభాగంలో భారత మార్కెట్లో ఈ ఏడాది 10 శాతం వాటా సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా 'జీ3' ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు.