గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (09:52 IST)

మైక్రోసాఫ్ట్ కొత్త 4జి స్మార్ట్ ఫోన్ లూమియా 950 ఎక్స్‌ఎల్

వరల్డ్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ 4జి టెక్నాలజీతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీనికి లూమియా 649 పేరు పెట్టింది. 4జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే 'లూమియా 950'ని ఆ కంపెనీ సోమవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ యేడాది డిసెంబర్ వరకు ఎయిర్‌టెల్ వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ స్మార్ట్ ఫోన్‌ను అందిస్తామని ఈ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన విషయంతెల్సిందే.
 
 
కాగా, లూమియా 950 ఫీచర్లను పరిశీలిస్తే 13 ఎంపీ రియర్ కెమెరా, 5.7 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సన్ లైట్ రీడబిలిటీ, 12 గిగా హెట్జ్ క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్‌, 32జీబీ ర్యామ్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర 649 డాలర్లుగా నిర్ణయించారు.