బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 మే 2015 (12:23 IST)

ప్రీఫిక్స్ సమస్య తీరిపోయింది: 0 లేదా +91 నొక్కాల్సిన అవసరం లేదు!

ఇక ప్రీఫిక్స్ సమస్య తీరిపోయింది. దేశవ్యాప్త మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్ పీ) అమలుకు ప్రధాన అడ్డంకిగా నిలిచిన 'ప్రీఫిక్స్' అవసరం ఇక లేనట్లే. ఇకపై ఎస్టీడీ కాల్ చెయ్యాలంటే 'సున్నా' లేదా '+91' నొక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా అవతలి వ్యక్తి ఫోన్ నెంబరును డయల్ చేస్తే చాలు. ఇప్పటికే పలు టెలికం సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.  
 
ఇండియాలో అత్యధికంగా మొబైల్ ఫోన్ కనెక్షన్లు అనుభవిస్తున్న ఎయిర్ టెల్, వోడాఫోన్, ఎంటీఎన్ఎల్ తదితర సెల్ ఫోన్ ఆపరేటింగ్ సంస్థలు '0', '+91' కలపకున్నా కూడా కనెక్షన్లను కలిపే సాంకేతికతను అమలు చేస్తున్నాయి. ఒకటి రెండు కంపెనీలు ఈ సాంకేతికతకు అప్ గ్రేడ్ కాలేదని సమాచారం. 
 
ఈ కంపెనీలు జూన్ నెలాఖరులోగా 'ప్రీఫిక్స్' లేకుండా కనెక్టింగ్ సదుపాయాన్ని తమ కస్టమర్లకు అందించాల్సి వుంది. కాగా జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఎంఎన్ పీ అమలు కానున్న సంగతి తెలిసిందే. ఈ సదుపాయం అమలైతే ఏ సర్కిల్ లోని ఏ టెలికం ఆపరేటర్ సేవలందుకుంటున్న వారైనా, మరో సర్కిల్, ఆపరేటర్ కు అదే నెంబరును మార్చుకోవచ్చు.