ఆ సత్తా డిజిటల్ ఇండియా అనే సాఫ్ట్ వేర్కే ఉంది: నరేంద్ర మోడీ
జెట్ స్పీడులో విస్తరిస్తున్న టెక్ ప్రపంచపు హార్డ్వేర్ను కదిలించగలిగే సత్తా ఒక్క డిజిటల్ ఇండియాకే ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బెంగళూరులో జరిగిన ఇండో-జర్మన్ సదస్సులో జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్తో కలసి మోడీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చాక 15 నెలల కాలంలో భారత్లో వ్యాపారం చేసేందుకు ఎన్నో అనుకూల పరిస్థితులను కల్పించాలన్నారు. మిగిలిన ప్రపంచంలో విదేశీ పెట్టుబడులు మందగిస్తున్న నేపథ్యంలో భారత్ ముందుకు దూసెకెళ్తోందని వ్యాఖ్యానించారు.
దేశ ఆర్థిక మూలాలపై విదేశీ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకమే ఇందుకు కారణమని చెప్పారు. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మోర్కెల్తో మూడు గంటల పాటు చర్చలు జరిపిన మోడీ 18 డీల్స్ కుదుర్చుకున్నారు.