శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (12:00 IST)

స్వీడన్‌ను శాసిస్తున్న భారత టెక్కీలు!

స్వీడన్‌ సాంకేతిక రంగాన్ని భారత టెక్కీలు శాసిస్తున్నారు. దీంతో భారత సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్లకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. 2009 - 13 మధ్య కాలంలో 9366 మంది భారత పౌరులకు స్వీడన్ ప్రభుత్వం వర్క్‌ పర్మిట్లు జారీచేయగా, అందులో 8803 మంది ఐటీ నిపుణులే ఉండటం గమనార్హం. 
 
స్వీడన్ సాంకేతిక రంగంలో పని చేస్తున్న భారత టెక్కీలు.. .మెరుగైన పనితీరుతో కస్టమర్లకు నాణ్యవంతమైన సేవలందిస్తున్నారని స్టాక్‌ హోం బిజినెస్ రీజియన్ సీఈవో ఒలోఫ్ జెటెర్‌ బర్గ్ తెలిపారు. వినియోగదారులను సంతృప్తిపరచడంలో ఇతర కంపెనీలతో పోలిస్తే భారతీయ కంపెనీలు ముందునిలుస్తున్నాయని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి సైతం భారత టెక్కీలకు సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు.