గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (14:01 IST)

రూ.10 వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో ఫోన్ ఆర్డర్ చేస్తే.. రూ.20 విలువ చేసే విమ్‌బార్ పంపించారు

ఆన్‌లైన్ మోసం మరోమారు బహిర్గతమైంది. ఈ-కామర్స్ వ్యాపారం నానాటికీ అభివృద్ధి చెందుతోంది. అదేసమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి నిదర్శనమే ఈ మోసం కూడా. రూ.10 వేలు చెల్లించి ఆన్‌

ఆన్‌లైన్ మోసం మరోమారు బహిర్గతమైంది. ఈ-కామర్స్ వ్యాపారం నానాటికీ అభివృద్ధి చెందుతోంది. అదేసమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి నిదర్శనమే ఈ మోసం కూడా. రూ.10 వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో ఫోను కోసం ఆర్డర్ చేస్తే రూ.20 విలువ చేసే విమ్‌బార్‌ను పార్శిల్‌లో పంపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జొన్నాదుల హేమవరప్రసాద్ అనే వ్య‌క్తి ఆన్‌లైన్‌లో ఫోన్ కోసం రూ.9,800 చెల్లించి ఫోన్‌కు ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత సదరు కంపెనీ పంపిన పార్శిల్‌ను విప్పి చూడగా, అందులో 20 రూపాయ‌ల విలువ చేసే సబ్బును పార్శిల్‌లో ఉంచింది. 
 
దీనిపై అతను స్పందిస్తూ... తాను ఈ నెల ఒకటో తేదీన పానసోనిక్ ఏ2 స్మార్ట్ ఫోన్ కోసం డ‌బ్బుచెల్లించి అమెజాన్ కంపెనీకి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన‌ట్లు హేమ‌వ‌ర‌ప్ర‌సాద్ తెలిపాడు. బ్లూడాట్ కొరియర్ సర్వీస్ డెలివరీ బాయ్ త‌న‌కు ఓ ప్యాకెట్‌ను ఇచ్చాడ‌ని, దాన్ని వెంట‌నే తెర‌చి చూశాన‌ని చెప్పాడు. అయితే, అందులో త‌న ఇచ్చిన ఆర్డ‌రు లేద‌ని విమ్‌బార్ సబ్బు ఉందని చెప్పాడు. 
 
ఈ విష‌యంపై తాను కొరియర్‌బాయ్‌ను అడ‌గ‌గా ఈ విష‌యంపై కంపెనీనే అడ‌గాల‌ని సూచించిన‌ట్లు చెప్పాడు. కొరియ‌ర్ పార్శిల్ వచ్చినట్లు సాక్ష్యం మాత్రమే ఇవ్వగలనని కొరియ‌ర్ బాయ్ త‌న‌కు చెప్పిన‌ట్లు పేర్కొన్నాడు. హేమవ‌ర‌ప్ర‌సాద్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.