గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 15 జులై 2017 (15:33 IST)

''వొడాఫోన్ సఖి'' ద్వారా మహిళలు ఇక ఫోన్ నెంబర్ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకోవచ్చు..

మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని వొడాఫోన్ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ''వొడాఫోన్ సఖి'' ప్లాన్‌తో ఇక ప్రైవేటుగా రీఛార్జ్ చేసుకునే సౌకర్యాన్ని వొడాఫోన్ కల్పించింది. తద్వారా ఇక నుంచి మహిళలు రీఛార్జ

మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని వొడాఫోన్ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ''వొడాఫోన్ సఖి'' ప్లాన్‌తో ఇక ప్రైవేటుగా రీఛార్జ్ చేసుకునే సౌకర్యాన్ని వొడాఫోన్ కల్పించింది. తద్వారా ఇక నుంచి మహిళలు రీఛార్జ్ కోసం రిటైలర్లకు తమ ఫోన్ నెంబర్లను చెప్పాల్సిన పనివుండదు. దీంతో పాటు ప్రత్యేకంగా మహిళల కోసం రూ.52, రూ.78, రూ.99 రీఛార్జీ ప్యాకులను వొడాఫోన్ ప్రకటించింది. 
 
కాగా మహిళలు రీఛార్జ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రైవేట్ అని 12604కి మెసేజ్ ఇస్తే ఒక వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. ఈ నెంబరును 24 గంటల్లోపు ఏదైనా రిటైల్ షాపులో చెప్తే చాలు. మీ నెంబర్ బహిర్గతం కాకుండా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యూపీ (పశ్చిమ), ఉత్తరాఖంఢ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆఫర్‌ను త్వరలో దేశవ్యాప్తం చేయనున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. 
 
వొడాఫోన్ సఖి ఆఫర్ రూ.52 నుంచి ప్రారంభం అవుతుంది. రూ.52లకు రీఛార్జ్ చేసుకుంటే.. 30 రోజుల వ్యాలిడిటీతో 42 నిమిషాల టాక్ టైమ్ 50ఎంబీ 2జీ, 3జీ డేటా లభిస్తుంది. అలాగే రూ.78, రూ.99లకు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అదే 30 రోజుల వ్యాలీడిటీతో 62 నిమిషాల టాక్ టైమ్ 50 ఎంబీ, 79 నిమిషాల టాక్ టైమ్‌తో 50 ఎంబీని పొందవచ్చును.