శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By JSK
Last Modified: శుక్రవారం, 5 ఆగస్టు 2016 (13:27 IST)

భ‌క్తులారా! కృష్ణా పుష్క‌ర స్నానంలో ద‌య‌చేసి ఆ ప‌ని చేయొద్దు!

విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్క‌ర సంరంభంలో పుణ్య స్నానాల‌కు వ‌చ్చే భ‌క్తులారా... న‌దీ స్నానం చేసే స‌మ‌యంలో మీరు ద‌య‌చేసి షాంపూ, స‌బ్బులు వాడొద్దు. ఒక్కో షాంపూ పాకెట్టులోని 7.5 మిల్లీ లీటర్ల షాంపూ చొప్పున, 8 కోట్ల మంది స్నానాలు చేస్తే, 6 లక్షల లీటర్ల నుంచీ

విజ‌య‌వాడ ‌:  కృష్ణా పుష్క‌ర సంరంభంలో పుణ్య స్నానాల‌కు వ‌చ్చే భ‌క్తులారా... న‌దీ స్నానం చేసే స‌మ‌యంలో మీరు ద‌య‌చేసి షాంపూ, స‌బ్బులు వాడొద్దు. ఒక్కో షాంపూ పాకెట్టులోని 7.5 మిల్లీ లీటర్ల షాంపూ చొప్పున, 8 కోట్ల మంది స్నానాలు చేస్తే, 6 లక్షల లీటర్ల నుంచీ 4 లక్షల లీటర్ల షాంపూ నదిలో కలుస్తుంది. ఒక్కొక్కరూ 20  గ్రాముల సబ్బు చొప్పున వాడితే, 16 లక్షల కిలోల సబ్బు కృష్ణనదిలో కలుస్తుంది. వాటిలోని కెమిక‌ల్స్ కృష్ణ నదీ జ‌లాల ప‌విత్ర‌త‌ను పాడుచేస్తాయి. స‌హ‌జసిద్ధ నీటిని క‌లుషితం చేస్తాయి. పుష్కరాలలో దాదాపు 12 కోట్ల మంది స్నానాలు చేస్తారని ఒక అంచనా. దీనినిబట్టి లెక్కిస్తే నదిలో కేవలం ఈ 12 రోజులలోనే ఎన్ని లక్షల లీటర్ల హానికరమైన షాంపూ నదిలో కలుపుతున్నామో మీరే గమనించండి. 
 
ఒక్కో షాంపూ పాకెట్టులో 7.5 మిల్లీ లీటర్ల చొప్పున షాంపూ ఉంటుంది. దీన్ని 8 కోట్ల స్నానాలు చేస్తే, 6 లక్షల లీటర్ల నుంచీ 4 లక్షల లీటర్ల షాంపూ నదిలో కలుపుతున్న‌ట్లు లెక్క‌. హానికారకమైన రసాయనాలు ఎన్నింటిని మన చేతులతో నదిలో కలుపుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్కరూ 20 గ్రాముల సబ్బు చొప్పున వాడటం వలన 8 కోట్ల మంది సబ్బు వాడితే 16 లక్షల కిలోల సబ్బు కృష్ణానదిలో కలుస్తుంది. దీనివలన నీరు ఎంతటి కలుషితం అవుతుందో మీరే గమనించండి. ప్రభుత్వం దీనిని నియంత్రించడం కష్టమైందేమీ కాదు. కానీ, ఎవ‌రికివారు స్వీయ నియంత్ర‌ణ పాటిస్తే మేలు. 
 
1) మూడుసార్లు నదిలో నుంచి మట్టిని తీసి ఒడ్డు మీద వేసి అప్పుడు స్నానం చేయాలి. నదులు చెరువులలో స్నానం చేసే ముందు ఈ విధంగా చేయడం వలన ప్రత్యేకంగా పూడిక తీత పనులు చేయాల్సిన అవసరం రాదు. ఇది ప్రాచీన రుషులు చెప్పిన స్నానవిధి.
2) నదీ స్నానం చేసేటప్పుడు ఆధునిక శుద్ధి పదార్థాలైన షాంపూ, సబ్బు వంటివి వాడరాదు. మృత్తికా స్నానం చేయవచ్చు. నూనె రాసుకోవడం, నలుగు పెట్టుకోవడం కూడా పుష్కర సమయంలో నిషేధమే.
3) పరిశుభ్రమైన మట్టి దొరికినప్పుడు దానిని ఒంటికి రాసుకుని చేయడం తప్పు కాదు. నేడు కోట్లాది మంది స్నానం చేస్తున్న పుష్కర ఘాట్‌లలో ఈ రకమైన మట్టి దొరికే అవకాశం లేదు. కనుక భక్తితో మంత్ర సహిత స్నానం చేయడమే ఉత్తమం. ఆపోహిష్టామయో… అనే మంత్రం, సర్వనదీనామాలున్న శ్లోకాలు పఠిస్తూ స్నానం చేయాలి. పలుమార్లు మునకలు వేయాలి.
 
4) రాత్రి ధరించిన వస్త్రాలతో స్నానం చేయకూడదు.
5) ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి స్నానం చేయాలి.
6) స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ … పిండటం గాని చేయకూడదు. బట్టల సబ్బు అసలు వాడరాదు.
7) అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు.
8) పళ్లు తోముకోవడం, కాలకృత్యములు తీర్చు కోవడం వంటివి నదీ ప్రాంతాలలో చేయరాదు. నదులలో గుప్తప్రదేశాలు శుభ్రం చేసుకోరాదు.
9)ఆధునిక స్విమ్మింగ్ పూల్స్‌లో ఏ విధమైన నియమ నిబంధనలున్నాయో అవే నిబంధనలు నదీస్నానాలలో మనవారు ఎప్పుడో విధించారని గుర్తుంచుకోండి.
శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు నెత్తికి చుట్టుకుంటాయి.