శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By ivr
Last Modified: మంగళవారం, 9 ఆగస్టు 2016 (19:59 IST)

గోదావరి పుష్కర స్నానం చేశాం కదా...? కృష్ణా పుష్కర స్నానం కూడా చేయాలా...?

మధ్యాహ్నం అన్నం తిన్నాం కదా... సాయంత్రం మళ్లీ భోజనం చేయాలా...? అన్నట్లుగా ఈ ప్రశ్న ఉంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఒక్కో నదికి ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కర పుణ్యస్నానం వస్తుంది. కనుక ఆయా నదులకు సంక్రమించే పుష్కరాల కాలంలో పుణ్యస్నానాలు చేయడం

మధ్యాహ్నం అన్నం తిన్నాం కదా... సాయంత్రం మళ్లీ భోజనం చేయాలా...? అన్నట్లుగా ఈ ప్రశ్న ఉంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఒక్కో నదికి ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కర పుణ్యస్నానం వస్తుంది. కనుక ఆయా నదులకు సంక్రమించే పుష్కరాల కాలంలో పుణ్యస్నానాలు చేయడం ద్వారా పాపాలు నశించి పుణ్యం వస్తుందని పురాణాలు చెపుతున్నాయి. 
 
ఒక్కో రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. మన దేశంలో ఉన్న 12 నదులలో ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం చొప్పున పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలను 12 రోజుల పాటు నిర్వహిస్తారు. నవగ్రహాల్లోని గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27, తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి. ప్రతి ఏడాది గురువు ఆయా రాశుల్లో ప్రవేశిస్తాడు.
 
మేషరాశిలో గురువు ప్రవేశించినప్పుడు గంగానదికి, వృషభరాశిలో ప్రవేశించినప్పుడు నర్మదానదికి, మిథునరాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి, వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు భీమరథీ నదికి, ధనూరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరవాహిని (తపతి) నదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధూనదికి, మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా ఒక్కోనదికి ఒక్కో రాశి అధిష్టానమై ఉంటుంది కనుక పుష్కర సమయంలో ఆ నదిలో సకల దేవతలు కొలువై వుంటారు. సకల దేవతలు కొలువై ఉన్న సమయంలో నదీ పుష్కర స్నానం ఆచరించడం వల్ల సకల దేవతలకు మనం కొలిచినట్లు అవుతుందని విశ్వాసం.