హనీమూన్ ట్రిపా.. వద్దుబాబోయ్.. అంటోన్న న్యూ కపుల్స్!
ఇదేంటి.. హనీమూన్ అంటే.. అన్నీ సర్దేసుకుని పోయే న్యూ కపుల్స్.. ప్రస్తుతం వద్దంటున్నారా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి బాబు.. కొత్తగా వివాహమైన దంపతులు.. ప్రశాంతంగా గడిపేందుకు.. కొత్త జీవితాన్ని ఆస్వాదించేందుకు హనీమూన్ ట్రిప్లకు వెళితే.. ప్రస్తుతం మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లడంతో వద్దని మానుకుంటున్నారు.
మధ్యతరగతి వారే కాకుండా సంపన్నులు కూడా ఇద్దరుగా మాత్రం లోన్లీ ప్రాంతానికి వెళ్లాలంటే భయపడుతున్నారు. భర్త కళ్ల ముందే.. అత్యాచారాలు.. మహిళలపై దాడులు వంటివి పెచ్చరిల్లిపోతున్న తరుణంలో.. హనీమూన్ ట్రిప్ అంటేనే కొత్త జంట జడుసుకుంటున్నారు.
అయితే హనీమూన్ ట్రిప్ను వివాహబంధంతో ఒక్కటయ్యే జంట జీవితాంతం మరిచిపోదు. అలాంటి ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి.
* దంపతులు వెళ్తున్న ప్రాంతానికి సంబంధించిన వివరాలు బ్యాగ్లో ఉంచుకోవాలి.
* పోలీసుల ఫోన్ నెంబర్లను గుర్తుంచుకోవాలి.
* ధైర్యంగా వ్యవహరించాలి
* భాగస్వామిని ఒంటరిగా వదిలిపోవడం చేయకూడదు.
* భాగస్వామి వెంటే ఉండటం.. నలుగురు ఉండే చోటనే ఉండటం చేయాలి.
* కరాటే, కుంఫూ వంటివి నేర్చుకుంటే ఇంకా మంచిది.