బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (10:00 IST)

జైపూర్‌లో 16ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం.. సిగరెట్‌తో కాల్చారు..

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. జైపూర్‌లో ఓ పదహారేళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. పని మనిషి అయిన ఆ అమ్మాయిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. జైపూర్‌లో ఓ పదహారేళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. పని మనిషి అయిన ఆ అమ్మాయిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే, బాధితురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమ్మాయి. ఆదివారంనాడు తనపై జరిగిన అత్యాచారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఒకరిని బిల్లుగా గుర్తించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేష్ చౌదరి చెప్పారు. 
 
తనపై అత్యాచారం జరిగిందని.. ఇందుకు ప్రతిఘటించిన కారణంగా.. సిగరెట్‌తో కాల్చినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.