మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (11:12 IST)

పుదుచ్చేరిలో ఘోరం- 17ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తుల అత్యాచారం..

పుదుచ్చేరిలో ఘోరం జరిగింది. చెన్నై ఘటన తరహాలో ఓ బాలికపై ఏడుగురు వ్యక్తులు ఇంట్లో నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి రెడ్డియార్‌పాళయం ప్రాంతానికి చెందిన బాలి

పుదుచ్చేరిలో ఘోరం జరిగింది. చెన్నై ఘటన తరహాలో ఓ బాలికపై ఏడుగురు వ్యక్తులు ఇంట్లో నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి రెడ్డియార్‌పాళయం ప్రాంతానికి చెందిన బాలిక (17) స్థానికంగా ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తోంది.


ప్రతి రోజు బస్సులో రాకపోకలు సాగించేది. వలుదావూర్‌ ప్రాంతానికి ఓ యువకుడు పరిచయం చేసుకుని, ప్రేమిస్తున్నట్లు ఆమెను నమ్మించాడు. కొన్ని రోజుల క్రితం ఆ బాలికను ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సెల్‌ఫోనులో చిత్రీకరించాడు. 
 
ఆ వీడియోతో ఆమెను బెదిరిస్తూ లొంగదీసుకునేవాడు. అనంతరం ఓ ఇంట్లో బంధించి తన ఆరుగురు స్నేహితులను పిలిచాడు. వాళ్లు కూడా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా చిత్రహింసలకు గురిచేశారు. అక్కడి నుంచి బయటపడ్డ బాలిక బంధువుల సాయంతో బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేశారు.

కమిటీ ఛైర్మన్‌ రాజేంద్రన్‌, సభ్యులు ఆ బాలికను విచారించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుక్కనూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.