శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (16:11 IST)

కోల్‌కతాలో దారుణం : 12 యేళ్ళ బాలికపై ఇద్దరు క్యాబ్ డ్రైవర్ల అత్యాచారం

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో దారుణం జరిగింది. బుధవారం ఉదయం 5 గంటల సమయంలో 12 ఏళ్ల బాలికను ఇద్దరు క్యాబ్ డ్రైవర్స్ కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ వివరాలన

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో దారుణం జరిగింది. బుధవారం ఉదయం 5 గంటల సమయంలో 12 ఏళ్ల బాలికను ఇద్దరు క్యాబ్ డ్రైవర్స్ కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దక్షిణ కోల్‌కతాలోని ఓ వీధి బాట పక్కనే గుడిసె వేసుకుని జీవిస్తున్న కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలికను ఇద్దరు ఓలా క్యాబ్ డ్రైవర్లు కిడ్నాప్ చేశారు. కాస్త దూరంగా ఉన్న ఆమె తల్లి ఇలా కిడ్నాప్ చేయడాన్ని చూసి, స్థానికులను అప్రమత్తం చేస్తూ కుమార్తెను రక్షించేందుకు ఉపక్రమించేలోగా వారు ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. 
 
పార్క్ సర్కస్ ఫ్లై ఓవర్ పక్కనే కారునాపి, కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలిక గొంతునులిమి చంపి పక్కనే ఉన్న కాలువలోకి విసిరేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకడు ఓలా క్యాబ్ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ముందు వారిద్దరూ పీకల్దాక మద్యం తాగినట్టు వారు వెల్లడించారు.