బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (10:14 IST)

ఢిల్లీలో కానిస్టేబుల్ కుమార్తెపై గ్యాంగ్ రేప్.. స్నేహితుడే కామాంధుడు!

దేశ రాజధానిలో మరో యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. యువతి స్నేహితుడితో పాటు.. మరో ఇద్దరు మిత్రులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ రేప్ జరిగింది కూడా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న కారులోనే కావడం గమనార్హం. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఏరియాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీలోని ఓ మహిళా కానిస్టేబుల్ కుమార్తె అని, కూల్ డ్రింక్‌లో మత్తు పదార్థాలు కలిపి ఈఘటనకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కూల్ డ్రింక్ సేవించిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిపై సామూహిక అత్యారానికి పాల్పడి.. నెహ్రూ ప్లేస్ ఫ్లైఓవర్ వద్ద వదిలి వెళ్లారని పోలీస్ అధికారి తెలిపారు. 
 
అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గమనించిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో యువతి అత్యాచారానికి గురైనట్టు తేలింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అమ్మాయి స్నేహితుడితో పాటు.. మరో వ్యక్తిని అరెస్టు చేశారు. స్నేహితునితో కలిసి యువతి కారులో బయలుదేరిందని, మార్గమధ్యంలో ఆమెకు మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయం ఇచ్చారని, అది తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.