గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (14:58 IST)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. 25 మంది స్కూలు విద్యార్థుల దుర్మరణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహా విషాదం నెలకొంది. రాష్ట్రంలోని ఎటా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని అలిగంజ్‌లో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తిరగబడింది. 25 మంది చిన్నారులు ఘటనా స్థలి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహా విషాదం నెలకొంది. రాష్ట్రంలోని ఎటా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని అలిగంజ్‌లో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తిరగబడింది. 25 మంది చిన్నారులు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది వరకు గాయపడ్డారు. 
 
ఈ చిన్నారులంతా ఎటాలో ఉన్న జేఎస్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇది అత్యంత బాధాకర విషయమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 
 
ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ...  ద‌ట్ట‌మైన పొగ‌మంచు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిందని తెలిపారు. పొగ‌మంచు కార‌ణంగా పాఠ‌శాల‌లు మూసేయాల‌ని స‌ర్కారు ఆదేశాలు జారీ చేసిన‌ప్ప‌టికి స‌ద‌రు స్కూలు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అంటున్నారు.