శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (09:48 IST)

నర్సింగ్ విద్యార్థిని అత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్

కేరళ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ దళిత విద్యార్థి అత్యాచారం కేసులో ఆ రాష్ట్ర పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19)పై ఇటీవల ఎర్నాకుళంలో గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెల్సిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో నర్సింగ్ విద్యార్థినిపై ఆమె ఇద్దరు స్నేహితులతో పాటు ఆటో డ్రైవర్ మంగళవారం అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.