శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (13:08 IST)

సిలిండర్ డెలివరీ బాయ్‌తో రాసలీలలు.. అడ్డొస్తున్నాడనీ భర్తను కుమార్తెతో కలిసి చంపేసిన భార్య

తమ అక్రమ సంబంధానికి కట్టుకున్న భర్త అడ్డొస్తున్నాడన్న కసితో కుమార్తె, కుమార్తె ప్రియుడు, తన ప్రియుడుతో కలిసి ఓ కసాయి మహిళ దారుణానికి పాల్పడింది. కట్టుకున్నోడిని కడతేర్చి.. రైలుపట్టాలపై పడేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట్టై జిల్లాలో చోటు చేసుకుంది. హతుని తల్లి ఫిర్యాదుతో అసలు నిందితులు ఎవరనే విషయం తేటతెల్లమైంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
పుదుక్కోట్టై జిల్లాలో నమనసముద్రం అనే ప్రాంతంలో కృష్ణమూర్తి అనే వ్యక్తి కిరాణా కొట్టుపెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య వసంతి, కుమార్తె అన్బుకరసిలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి గత ఫిబ్రవరి 25వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మృతదేహం ఆయన ఇంటి వెనుకనే ఉన్న రైలు పట్టాలపై పడివుంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో మృతుని తల్లి సింగమ్మాళ్ తిరుచ్చి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఒక ఫిర్యాదు చేసింది. తన కోడలు వసంతికి సిలిండర్ డెలివరీ బాయ్‌తోనూ, అన్బుకరసికి కూడా మరో యువకుడితో అక్రమ సంబంధం ఉండేది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణమూర్తి వారిద్దరిని గట్టిగా మందలించారనీ, దీన్ని జీర్ణించుకోలేని వారు.. తన కుమారుడిని వారిద్దరు కలిసి హత్య చేసివుంటారని సింగమ్మాళ్ తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వసంతి, అన్బుకరసిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించారు. ఈ విచారణలో అసలు విషయం తెలిశారు. తమతో పాటు సిలిండర్ డెలివరీ బాయ్, మరో వ్యక్తితో కలిసి హత్య చేసి, మృతదేహాన్ని పట్టాలపై పడేసినట్టు చెప్పారు. దీంతో వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో సిలిండర్ డెలివరీ బాయ్ వీరచోళన్ కోర్టులో లొంగిపోగా, ఈ హత్య కేసులో సంబంధం ఉన్న అన్బుకరసి ప్రియుడు రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.