శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 26 మే 2018 (08:47 IST)

గదిలోకి తీసుకెళ్లి అన్నీ చూపించేది... టెన్త్ విద్యార్థికి లేడీ టీచర్ శృంగార పాఠాలు...

ఆమె ఓ సైన్స్ టీచర్. ఆమె భర్త ఓ లెక్చరర్, పైగా, ఇద్దరు పిల్లలకు తల్లి. వయసు 35 యేళ్లు. అయినా కామకోర్కెలను నిగ్రహించుకోలేక పోయింది. ఫలితంగా తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే టెన్త్ విద్యార్థిని పడకగదిలోకి తీసు

ఆమె ఓ సైన్స్ టీచర్. ఆమె భర్త ఓ లెక్చరర్, పైగా, ఇద్దరు పిల్లలకు తల్లి. వయసు 35 యేళ్లు. అయినా కామకోర్కెలను నిగ్రహించుకోలేక పోయింది. ఫలితంగా తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే టెన్త్ విద్యార్థిని పడకగదిలోకి తీసుకెళ్లి శృంగార పాఠాలు చెప్పసాగింది. పైగా, ఆ విద్యార్థిని ట్యూషన్ మాన్పిస్తే ఆత్మహత్య చేసుకుంటానని యువకుడి తల్లిదండ్రులను బెదిరించింది. బెదిరించడమే కాదు.. అన్నంతపనీ చేసింది. ఈ సంఘటన చండీగఢ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చండీగఢ్‌: రోజూ తన వద్దకు ట్యూషన్‌కి వచ్చే పిల్లాడ్ని ఆమె గదిలో పెట్టి తాళం వేసేసింది... అదీ అతని తల్లిదండ్రుల ఎదుటే! వాణ్ణి ట్యూషన్‌కి పంపడం మాన్పిస్తే ఊరుకోనని... ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది! ఇది తెలిసి చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆ కుర్రాణ్ణి విడిపించి తల్లిదండ్రులకు అప్పగించినా... ఆ లేడీ టీచర్‌ మాత్రం పంతం వీడలేదు. ఆ కుటుంబం ఇంటికెళ్లి ఆత్మహత్యా యత్నం చేసింది. ఆ తర్వాతే... అసలు విషయం బయటపడింది. రెండు నెలలుగా ఆ విద్యార్థిపై ఆమె లైంగిక దాడికి పాల్పడుతోందని! ఆమె ప్రభుత్వ పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయురాలు. వయసు 35 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి. భర్త లెక్చరర్‌. 
 
చండీగఢ్‌ రామ్‌ దర్బార్‌ కాలనీకి చెందిన 35 యేళ్ల మహిళ ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పని చేస్తోంది. ఈమె భర్త లెక్చరర్‌ కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆమె వద్దకు ట్యూషన్‌కి వస్తున్న పదో తరగతి విద్యార్థిదీ అదే ప్రాంతం. అతని చెల్లెలు కూడా కలిసే ట్యూషన్‌కి వచ్చేది. అయితే, అబ్బాయి చదువుపై శ్రద్ధ పెట్టాలంటే ఇద్దర్నీ వేర్వేరుగా పంపాలని వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అలానే చేశారు. 
 
మూడు నెలలుగా ట్యూషన్‌కు పంపిస్తున్నా తెలివైన ఆ విద్యార్థికి మార్కులు పెరగకపోగా తగ్గిపోతూ వచ్చాయి. పైగా చదువుపై ధ్యాస తగ్గిపోవడాన్నీ తల్లిదండ్రులు గమనించారు. ఇక లాభం లేదని... ట్యూషన్‌ మాన్పించాలని భావించి, టీచర్‌కు ఆ విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారు. ఈ మాట చెప్పగానే వారితో ఆ టీచర్ గొడవకు దిగింది. వెంటనే కుర్రాణ్ణి గదిలో పెట్టి బంధించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు వచ్చి బాలుడిని విడిపించి... ఇంటికి పంపారు. అయితే, ఆ టీచర్‌ వాళ్ల వెనకే వారింటికి వెళ్లింది. మరుగుదొడ్డిలోకి వెళ్లి గడియ పెట్టుకుని విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ సీసాలోని మందు తాగేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.
 
ఈ కేసును ఎలా పరిష్కరించాలో తెలియని పోలీసులు... చైల్డ్ లైన్‌కు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. చైల్డ్ లైన్ కౌన్సిలర్లు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి రోజూ గదిలోకి తీసుకెళ్లి గడియపెట్టి దుస్తులన్నీ విప్పేసి.. అందాలను చూపిస్తూ, రెచ్చగొడుతూ కామవాంఛ తీర్చుకునేదని విద్యార్థి వెల్లడించాడు. ఇలా చేయడం వల్ల నా మనసు చెడిపోయింది. పైగా, ఒక సిమ్‌ కార్డు తీసిచ్చి.. ప్రతి రోజూ రాత్రి బూతు మాటలు మాట్లాడుతూ ఉండేదని వెల్లడించాడు. పైగా, ఆ టీచర్‌ తాగింది దగ్గు మందేనని వైద్యులు నిర్ధారించారు. పోక్సో చట్టం కింద ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.