శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:55 IST)

14 ఏళ్ల బాలికపై 40 మంది గ్యాంగ్ రేప్.. రాత్రిపూట మత్తుమందిచ్చి..?

ఆసియా దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలిక కామాంధుల చేతుల్లో నలిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది పురుషులు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. థాయ్‌లాండ్‌లోని పంగ్

ఆసియా దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలిక కామాంధుల చేతుల్లో నలిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది పురుషులు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. థాయ్‌లాండ్‌లోని పంగ్ ఎన్‌గా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బాధితురాలి తల్లిదండ్రులు కూలి కార్మికులు. రాత్రిపూట పనులకు వెళ్ళిపోతారు. చిన్నారి మాత్రమే ఇంట్లో ఒంటరిగా వుండేది. ఆ సమయంలో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
అదే వ్యక్తి వేరొక రోజున చిన్నారిపై అత్యాచారం పాల్పడేందుకు తన స్నేహితులను తీసుకొచ్చాడు. వారందరూ కలిసి చిన్నారికి మత్తుమందిచ్చి అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తల్లిదండ్రుల వద్ద ఈ విషయాన్ని బాధిత బాలిక దాచేసింది. ఇలా రోజు రోజుకీ చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ఓ బృందం వచ్చి వెళ్లేది. గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు ఈ ఘోరం జరిగింది. 
 
ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో విచారణ జరపాల్సిందిగా సదరు  రాష్ట్ర పోలీసులకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ లైంగిక దాడిని అడ్డుకోవడానికి బాధితురాలే.. తల్లితో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.