గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 4 ఫిబ్రవరి 2017 (16:03 IST)

ప్రధాని మోదీకి భంగపాటు ఖాయమా...? యూపీ, పంజాబ్, గోవాల్లో కమలం వాడుతుందట....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటు ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెపుతున్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో భాజపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కమలం వాడిపోక తప్పదని లాలూ ప్రసాద్ య

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటు ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెపుతున్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో భాజపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కమలం వాడిపోక తప్పదని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు.
 
ఈ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలే ప్రధాన కారకులని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రధానమంత్రి దేశ ప్రజల నడ్డి విరిచారనీ, ఇప్పుడా కోపాన్ని ప్రజలు తీర్చుకోబోతున్నట్లు ఆయన చెప్పారు. ఇక అమిత్ షాకు డబ్బులు తప్ప ఇంకేమీ పట్టదనీ, అసలు ఆయన రాజకీయ నాయకుడేనా అంటూ ప్రశ్నించారు. డబ్బు లావాదేవీలు తప్ప అమిత్ షా ఇక దేని గురించి పట్టించుకోరని లాలూ విమర్శించారు.