మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (11:31 IST)

ఒంటరిగా నిద్రిస్తున్న ఆంటీపై మద్యం మత్తులో రెచ్చిపోయి.. అత్యాచారం చేసిన మాజీ ఖైదీ..

ఒంటరిగా ఉన్న మహిళపై ఓ కామాంధుడు ఇంటివరకు వచ్చి మరీ అత్యాచారం చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న మహిళపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. బయటకు చెప్తే చంపేస్తానని.. తాను మళ్లీ మళ్లీ వస్తానని

ఒంటరిగా ఉన్న మహిళపై ఓ కామాంధుడు ఇంటివరకు వచ్చి మరీ అత్యాచారం చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న మహిళపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. బయటకు చెప్తే చంపేస్తానని.. తాను మళ్లీ మళ్లీ వస్తానని.. లైంగికంగా తనకు సహకరించాలని బెదిరించాడు. అయితే ఆ కామాంధుడిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 
 
వివరాల్లోకి వెళితే ఓ క్రిమినల్ కేసులో జైలుకు వెళ్లిన 35 ఏళ్ల నిందితుడు ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ పక్కింటి మహిళ మీద అత్యాచారం చేశాడని మోహ్రోలి పోలీసులు చెప్పారు. మెహ్రోలి ప్రాంతంలో 60 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. ఈమె కుమార్తెకు వివాహం కావడంతో ఆమె భర్తతో కలిసి ఢిల్లీలోనే వేరే ప్రాంతంలో నివాసం ఉంటోంది. మహిళ మాత్రం తన కుమారుడితో కలిసి మెహ్రోలి ప్రాంతంలో నివాసం ఉంటోంది.
 
మహిళ కుమారుడు ఢిల్లీలోనే ఇంటికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి స్నేహితులతో కలిసి అతను బయటికి వెళ్లడంతో.. కుమారుడు ఇంటికొస్తాడని.. ఇంటి తలుపులు తీసి బాల్కనీలో నిద్రపోయింది. దీన్నే అదనుగా తీసుకున్న అదే రోడ్డులో నివాసముంటున్న 35 ఏళ్ల కామాంధుడు.. ఒంటరిగా నిద్రపోతున్న మహిళపై మద్యం మత్తులో రెచ్చిపోయి అత్యాచారం చేశాడు.
 
అసలే జైలు చుట్టూ తిరుగుతున్న నిందితుడు చంపేస్తాడేమోనని భయంతో ఆమె ఈ విషయాన్ని కుమారుడికి చెప్పలేదు. అయితే కామాంధుడు మళ్లీ వచ్చి ఎక్కడ తన కోరిక తీర్చమని వేధిస్తాడో అనే భయంతో తన కుమార్తె దగ్గరకు వెళ్లింది. కుమార్తె సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని జైలు పంపించారు. బాధిత మహిళకు రక్షణ కల్పించారు.