గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (10:17 IST)

వారణాసిలో దారుణం.. 70 యేళ్ళ ఫ్రెంచ్ మహిళపై గార్డు అత్యాచారం

పవిత్ర పుణ్యస్థలం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఓ విదేశీ మహిళ అత్యాచారానికి గురైంది. అదీ కూడా 70 యేళ్ళ వృద్ధురాలు. ఈమెపై మహిళా గార్డు అత్యాచానికి పాల్పడ్డాడు. తాజాగా వెల

పవిత్ర పుణ్యస్థలం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఓ విదేశీ మహిళ అత్యాచారానికి గురైంది. అదీ కూడా 70 యేళ్ళ వృద్ధురాలు. ఈమెపై మహిళా గార్డు అత్యాచానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహిళల్లో అక్షరాస్యతపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్న 70 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ ఓ గార్డు చేతిలో అత్యాచారానికి గురైంది. వారణాసిలోని మధోపూర్ గ్రామంలో ఓ రిసార్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
మహిళల్లో అక్షరాస్యత పెంచేందుకు 70 యేళ్ళ ఫ్రెంచ్ మహిళ ఓ ఎన్జీవో సంస్థను నడుపుతోంది. గత 11 నెలలుగా వారణాసిలోని మధోపూర్ గ్రామంలో ఓ రిసార్ట్‌లో నివశిస్తోంది. అయితే, మీర్జాపూర్‌కు చెందిన ఓంప్రకాష్ అనే వ్యక్తి ఆమె ఉంటున్న రిసార్ట్‌‌కు గార్డుగా పనిచేస్తున్నాడు. 
 
బుధవారం రాత్రి తాగిన మత్తులో ఉన్న ఓంప్రకాష్ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేలోపే గార్డు పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను ఆసుపత్రిలో చేర్చినట్టు పోలీసులు తెలిపారు.