శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 26 మే 2015 (08:46 IST)

పక్కింటోడితో ఉందని... కరెంటు వైరు బిగించి... చెల్లెల్ని చంపేసిన అన్న

తన చెల్లి పక్కింటి వ్యక్తితో చనువుగా ఉండడం అతనితో శారీరక సంబంధం కలిగి ఉండడాన్ని ఓ అన్న భరించలేకపోయాడు. అలా వ్యవహరించవద్దని పలుమార్లు చెప్పి చూశాడు. అయినా ఆమెలో మార్పురాలేదు. దీంతో ఆగ్రహించిన అన్న ఆమెను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
మీరట్ సమీపంలోని లీసా రే గేట్ ప్రాంతంలో నజియా అలియాస్ లజ్జో (18) అనే అమ్మాయి తన పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉండేది. దీంతో తాను తన పద్దతి మార్చుకోవాలని హెచ్చరించింది. అయినా సరే ఆమెలో మార్పురాలేదు. దీంతో ఆమె అన్న మహ్మద్ యాసిన్ (25) పీకకు కరెంటువైరు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
 
అనంతరం అతడు నేరుగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.