శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (14:03 IST)

లైంగిక దాడి జరిగిందని చెప్పినా వినలేదు.. చెవి కొరికి చేత బట్టుకుని...

లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. బాధితురాలు తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి చెవిని చేతబట్టుకుని పోలీసుల వద్దకు వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా అనే ప్రాంత

లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. బాధితురాలు తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి చెవిని చేతబట్టుకుని పోలీసుల వద్దకు వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. లైంగిక దాడి జరిగిందని చెప్పినా పట్టించుకోని పోలీసులు... ప్రత్యక్ష సాక్ష్యంగా కొరికిన చెవిని తీసుకురావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే గత సోమవారం తన పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి దిగారు. ఇంటి బయట ఉన్న గదిలో ఆమె భర్త.. భార్య కేకలు విని ఇంట్లోకి పరిగెత్తుకొచ్చాడు. దీంతో, మిగిలిన ముగ్గురు అతడిపై తీవ్రంగా దాడి చేస్తుండగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తి చెవిని బాధితురాలు కొరికిపారేసింది.
 
ఆ తర్వాత వారు జరిగిన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి వెళ్లిపోయారు. ఈ మేరకు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా రెండు రోజులపాటు స్థానిక పోలీసులు కేసు నమోదుచేసుకోలేదు. దీంతో బాధితురాలు ఏం చేయాలో పాలుపోక.. నిందితుడి చెవిని కొరికిన విషయం గుర్తుకుతెచ్చుకొని ఆ భాగాన్ని తీసుకొని నేరుగా ఎస్‌పి కార్యాలయానికి చేరింది. దీంతో ఎస్పీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.