ట్విట్టర్లో కేజ్రీవాల్-మహేష్ శర్మల వార్.. కూతురు పెళ్లి కాదండోయ్.. కుమారుడికే పెళ్లి..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తొలుత నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. నోట్ల కొరత వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కేజ్రీవాల్ తెలిపారు. తాజాగా అరవింద్ కేజ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తొలుత నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. నోట్ల కొరత వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కేజ్రీవాల్ తెలిపారు. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర మంత్రి మహేశ్ శర్మపై తన ట్వీటు బాణాలు ఎక్కుపెట్టారు.
'భాజపా ఎంపీ, కేంద్రమంత్రి మహేశ్ శర్మ తన కుమార్తె పెళ్లి రూ.2.5లక్షలతోనే చేస్తున్నారా.. అన్ని చెల్లింపులు చెక్కులతోనే చేస్తున్నారా? ఆయన పాత నోట్లు ఎలా మార్చారో చెప్పాలి' అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. మహేశ్ శర్మ వెంటనే తిరుగు సమాధానం ఇచ్చారు.
కేజ్రీవాల్ ముందు వాస్తవాలను సరిగ్గా తెలుసుకోవాలని సూచిస్తూ పెళ్లి తన కుమార్తెది కాదని, కుమారుడిదని మహేష్ శర్మ చెప్పారు. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి వివాహ వేడుకకు సంబంధించిన చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారానే చేస్తున్నామని మహేశ్ శర్మ సమాధానం ఇచ్చారు.
మరోవైపు పార్లమెంట్ భవనం ఎదుట, గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ధర్నా నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.