బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (19:18 IST)

వాట్సాప్‌లో హద్దు మీరిన భార్య.. ఉరేసుకున్న భర్త.. కుమారుడికి విషమిచ్చి?

సోషల్ మీడియా ప్రభావంతో ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే.. సామాజిక ప్రసార మాధ్యమాల వల్ల మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో భార్య హద్దుమీరిన కారణంగా మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోవైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోవై, శరవణంపట్టికి చెందిన అర్జున్ (46) టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అలమేలు (40) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ దంపతులకు ఓ కుమారుడు వున్నాడు. ఇతడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం పని ముగించుకుని ఇంటికి చేరుకున్న అలమేలు.. ఇంటి లోపల లాక్ అయి వుండటం గమనించి కిటికీలను తెరిచి చూసింది. 
 
అంతే.. భర్త, కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం చూసి షాకైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి మొత్తం తనిఖీలు చేశారు. ఇలా పోలీసులకు ఓ సూసైడ్ నోట్ దొరికింది. 
 
ఈ లేఖలో అలమేలు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం వుందని.. ఆమె వాట్సాప్‌లో హద్దుమీరిందని.. దీంతో మనస్తాపానికి గురైన తాను.. కుమారుడికి విషం ఇచ్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నానని రాశాడు. దీనిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.